పెసర దోసె
కావలసిన పదార్ధాలు:బియ్యం: 1 గ్లాస్
అల్లం: చిన్న ముక్క
జీలకర్ర:1 స్పూన్
పచ్చిమిరపకాయ:4
కొత్తిమీర: కొంచెం
ఉప్పు:2 స్పూన్
నూనె: కాలదానికి సరిపడా
తయారీ విధానం:
ముందుగా పెసరపప్పు,బియ్యం ని నానపెట్టుకోవాలి. 4 గంటలు సరిపోతుంది. తరువాత మిక్సీ జార్ లో పెసరపప్పు, బియ్యం, పచ్చిమిరపకాయ, అల్లం, ఉప్పు, కొత్తిమీర, జీలకర్ర వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత దోస పెనం మీద దోసల పోసుకొని ఆయిల్ వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే పెసర దోస రెడీ. ఇది అల్లం పచ్చడిలో తింటే బాగుంటుంది.
No comments:
Post a Comment